News March 12, 2025

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం: కిషన్ రెడ్డి

image

TG: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ ప్రశ్నిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లు కావాలని కేంద్రానికి లేఖ రాయడం నవ్వులాటగా ఉందన్నారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని సూచించారు.

Similar News

News January 21, 2026

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌ <>(RGNIYD) <<>>6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు రేపు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును PG (ఎకనామిక్స్, సోషియాలజీ, యూత్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, యూత్ డెవలప్‌మెంట్), NET/SLAT/SET, PhD ఉత్తీర్ణులు అర్హులు. నెలకు రూ.52వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in

News January 21, 2026

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మళ్లీ పడతాయా?

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 25,185 వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 82,025 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో ICICI బ్యాంక్, BE, ట్రెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాలో ట్రేడవుతున్నాయి. నిన్న ₹9 లక్షల కోట్లకు పైగా మార్కెట్లు <<18907026>>నష్టపోవడం<<>> తెలిసిందే.

News January 21, 2026

ఆ ఉద్యోగుల శాలరీలు నేరుగా ఖాతాల్లోకి!

image

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో IFMIS విధానంలో నేరుగా ఖాతాల్లోకి జీతాలు చెల్లించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో హెచ్‌వోడీ, ఏజెన్సీల అకౌంట్లు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇది April నుంచి అమలయ్యేలా ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తోంది. కాగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.