News March 28, 2024
SRH ప్లేయర్ సరికొత్త రికార్డు
IPLలో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా SRH బౌలర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో మనీశ్ పాండే 7 జట్లకు ప్రాతినిధ్యం వహించగా, జయదేవ్ 8 టీమ్స్(KKR, DC, RCB, పుణె, RR, MI, LSG, SRH) తరఫున ఆడారు. అలాగే IPLలో రెండు అత్యధిక స్కోర్లు చేసిన జట్లలో భాగస్వామిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచారు. ఆరోన్ ఫించ్ అత్యధికంగా 9 జట్ల(RR, DC, పుణె, SRH, MI, గుజరాత్ లయన్స్, పంజాబ్, RCB, KKR)కు ఆడారు.
Similar News
News January 17, 2025
ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!
రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్), నాలుగో ప్లేస్లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.
News January 17, 2025
BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
News January 17, 2025
IPL: ఢిల్లీ కెప్టెన్గా అక్షర్ పటేల్?
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. KL రాహుల్, డుప్లెసిస్ వంటి ప్లేయర్లున్నా టీమ్ మేనేజ్మెంట్ అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2019 నుంచి DCకి ఆడుతున్న అక్షర్, గత సీజన్లో ఆ టీమ్కు వైస్ కెప్టెన్గా ఉన్నారు. ఒక మ్యాచులో కెప్టెన్సీ కూడా చేశారు. ఇంగ్లండ్తో జరిగే T20 సిరీస్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఉండనున్నారు.