News April 10, 2024
500 ఏళ్ల తర్వాత జన్మస్థలంలో శ్రీరామ నవమి

అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, సుమారు 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రామ్లల్లా నుదుటిపై 75 MM వ్యాసార్థంలో వృత్తాకార తిలకంలా 4 నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి.
Similar News
News November 12, 2025
దేశవాళీ ఆడాల్సిందే.. RO-KOకు బీసీసీఐ అల్టిమేటం?

కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని, లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని హిట్మ్యాన్ MCAకు సమాచారం అందించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. కోహ్లీ ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. T20, టెస్టులకు వీడ్కోలు పలికిన RO-KO వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
News November 12, 2025
సివిల్స్ ఫలితాలు విడుదల

ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన సివిల్ సర్వీసెస్(మెయిన్) ఎగ్జామినేషన్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2,736 మంది మెయిన్స్ క్లియర్ చేశారు. https://upsc.gov.in/, https://www.upsconline.gov.inలో ఎంపికైన వారి ర్యాంక్, పేర్లతో జాబితాను ఉంచారు. వీరికి పర్సనాలిటీ టెస్టు నిర్వహించి ర్యాంకుల ఆధారంగా IAS, IPS, IFS సహా పలు రకాల సెంట్రల్ సర్వీసెస్లు కేటాయిస్తారు.
News November 12, 2025
‘Mom my first love’.. టాటూ చూసి డెడ్బాడీ గుర్తింపు

ఢిల్లీ బ్లాస్ట్లో మరణించిన వారి డెడ్బాడీలను గుర్తించడం కష్టతరంగా మారింది. టాటూలు, టీ షర్టు ఆధారంగా తమ ఆత్మీయుల మృతదేహాలను గుర్తించారు. చాందినీ చౌక్లో ఫార్మా బిజినెస్ చేసే 34 ఏళ్ల అమర్ కటారియా బ్లాస్ట్లో మరణించాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అతని డెడ్బాడీని చేతిపై ఉన్న ‘Mom my first love’, ‘Dad my strength’ టాటూల ఆధారంగా సోమవారం రాత్రి మార్చురీలో కుటుంబసభ్యులు గుర్తించారు.


