News March 16, 2024
శ్రీకాకుళం: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికలు నిభందనలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News November 21, 2025
సంతబొమ్మాళిలో మహిళ దారుణ హత్య!

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమయిందని, మర్డర్కు గురైనట్లు ఎస్సై నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. నందిగామ మండలం కొండబీంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత (34) గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి వరకు పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను పోస్ట్ చేశారు. ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉందన్నారు.
News November 20, 2025
నౌపడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 20, 2025
SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.


