News April 6, 2024
విప్రో కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712416822202-normal-WIFI.webp)
దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థెర్రీ డెలాపోర్టే తన పదవులకు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శ్రీనివాస్ పల్లియాను సీఈవోగా సంస్థ నియమించింది. కాగా విప్రోలో డెలాపోర్టే 2020 జులై నుంచి పనిచేస్తున్నారు. సంస్థ ఎదుగుదలలో భాగస్వామిగా అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734357735912_367-normal-WIFI.webp)
AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
News January 25, 2025
మహాత్మాగాంధీకి ఇండోనేషియా అధ్యక్షుడి నివాళులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737799850896_1045-normal-WIFI.webp)
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.
News January 25, 2025
బాలీవుడ్లో ఐక్యత లేదు: అక్షయ్ కుమార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737798211101_1045-normal-WIFI.webp)
హిందీ చిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందని నటుడు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నాకే అవకాశం దక్కితే పరిశ్రమలో ఐక్యత తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటా. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలి. సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాన్ని కనుగొనాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఇతర పరిశ్రమలపైనా అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.