News March 7, 2025

అమరావతిలో శ్రీనివాస కళ్యాణం.. ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు

image

AP: రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం శ్రీవారి ఆలయం వైభవం తెలియజేసేందుకు ఈ నెల 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు TTD EO శ్యామలరావు తెలిపారు. దీనికి CM చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తారని చెప్పారు. 25 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీనివాస కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని EO వెల్లడించారు. వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణం 2022లో పూర్తైంది.

Similar News

News November 16, 2025

iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

image

iBOMMA, BAPPAM సైట్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ అవ్వడం లేదు. iBOMMA సైట్‌లో 1XBet అనే <<18296786>>బెట్టింగ్‌<<>>, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించడం అతడి ప్లాన్ అని, ఇందుకోసం బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

News November 16, 2025

నేను 2 గంటలే నిద్రపోతా: జపాన్ ప్రధాని

image

జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రోజూ రాత్రి కేవలం 2 గంటలు, మహా అయితే 4 గంటలు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. ఈ అలవాటు తన స్కిన్‌కు చేటు చేస్తుందని అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల కోసం అధికారులతో 3am వరకు మీటింగ్ పెట్టడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. జపాన్‌లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగా లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News November 16, 2025

APPLY NOW: MECLలో ఉద్యోగాలు

image

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<>MECL<<>>) 10 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, ఎంటెక్, MSc (జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/జియోఫిజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. UPSC-CGSE 2024 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mecl.co.in/