News March 7, 2025
అమరావతిలో శ్రీనివాస కళ్యాణం.. ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు

AP: రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం శ్రీవారి ఆలయం వైభవం తెలియజేసేందుకు ఈ నెల 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు TTD EO శ్యామలరావు తెలిపారు. దీనికి CM చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తారని చెప్పారు. 25 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీనివాస కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని EO వెల్లడించారు. వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణం 2022లో పూర్తైంది.
Similar News
News April 11, 2026
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.
News April 11, 2026
IRCTC చెన్నైలో 84 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

కాంట్రాక్ట్ పద్ధతిలో 84 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి IRCTC చెన్నైజోనల్ ఆఫీస్ నోటిఫికేషన్ ఇచ్చింది. BSc హాస్పిటాలిటీ&హోటల్ అడ్మినిస్ట్రేషన్, హోటల్ మేనేజ్మెంట్&క్యాటరింగ్ సైన్స్, సంబంధిత విభాగాల్లో BSc/BBA/MBA చేసినవారు అర్హులు. నెలకు రూ.30,000 స్టైఫండ్గా ఇస్తారు. వయసు 27 ఏళ్లు ఉండాలి. APR- 25, 27, 28న ఇంటర్వ్యూలు ఉంటాయి. మరిన్ని వివరాలకు https://irctc.com/new-openings.php చూడండి.
News April 11, 2026
సింగర్ మంగ్లీపై కేసు నమోదు

ప్రముఖ సింగర్ మంగ్లీపై HYD పంజాగుట్ట PSలో కేసు నమోదైంది. మంగ్లీ, ఆమె సోదరుడు, మరికొంతమందితో కలిసి పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో 100 మంది నుంచి రూ.10 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. న్యాయం కోరుతూ వారు లాయర్ సుబ్బారావును ఆశ్రయించారు. కాగా ఆ న్యాయవాదిని మంగ్లీ బృందం బెదిరించడంతో అతను PSలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ సహా సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులపై కేసు నమోదైంది.


