News May 23, 2024
రేపు ఉ.10 గంటలకు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

AP: ఆగస్టు నెల కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300)ను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు అందుబాటులో ఉంటాయి. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. కాగా శ్రీవాణి ట్రస్టు డోనర్స్ దర్శన, గదుల కోటా(ఆగస్టు) ఇవాళ ఉ.11 గంటలకు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.
Similar News
News March 12, 2026
వరి పంట విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

వరి పంట ప్రస్తుతం నాటిన సమయాన్ని బట్టి ఈనిక, గింజ పాలుపోసుకునే దశ, పూత దశలో ఉంది. ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ పంట పూత దశలో ఉన్నట్లైతే నీటి ఎద్దడికి గురికాకుండా 2 అంగుళాల మేర నీరు ఉండేలా చూడాలి. పంట పిలక దశలో ఉంటే రెండో దఫాగా 45 kgల యూరియా వేయాలి. చిరుపొట్ట దశలో ఉన్న పొలాల్లో చివరి దఫా యూరియా 45KGలు+ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20kgలు వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 12, 2026
తులసీ దళాలతో ఇలా చేస్తే..

ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి తులసి పరిహారాలు మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. ‘ఎండిన 7 తులసి కొమ్మలను దారంతో కట్టి నెయ్యిలో ముంచి విష్ణుమూర్తి ముందు దీపం వెలిగిస్తే అదృష్టం వరిస్తుంది. ఎండిన ఆకులను గంగాజలంలో కలిపి ఇల్లంతా చల్లితే సానుకూలత పెరుగుతుంది. ఎండిన తులసి కొమ్మను ఎరుపు వస్త్రంలో చుట్టి పర్సులో ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షంతో ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయి’ అని సూచిస్తున్నారు.
News March 12, 2026
వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

TG: వాట్సాప్ ద్వారా పలు రకాల వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఓపీ రిజిస్ట్రేషన్, హెల్త్ కార్డుల డౌన్లోడ్ వంటి సేవలను అందించనుంది. ప్రభుత్వ తేనున్న ప్రత్యేక నంబర్కు HI అని మెసేజ్ చేసి, ఆయుష్మాన్ భారత్ ID, ఆధార్తో వెరిఫై చేసుకోవాలి. ఆస్పత్రిని సెలక్ట్ చేసుకుని సేవలు పొందవచ్చు. ఫీడ్బ్యాక్ ఇచ్చి ఫిర్యాదులూ చేయవచ్చు. తొలుత 1000 ఆస్పత్రులలో అందుబాటులోకి తేనున్నారు.


