News April 3, 2025
SRPT: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic.వెబ్సైట్లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News April 7, 2025
ఎమ్మెల్యే గండ్రకు పంచాయతీ కార్యదర్శులు మెమొరాండం అందజేత

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని కార్యదర్శులందరూ బదిలీలు నిలిపివేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్చిన విధంగా కాకుండా నియోజకవర్గంలోని వేరే మండలాలకు బదిలీ చేయాల్సిందిగా అధికారులకు తెలియజేస్తానని చెప్పారు. అలాగే కార్యదర్శులు అందరూ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేసేలా హామీ ఇచ్చారు.
News April 7, 2025
ట్రంప్ టారిఫ్లపై ఆందోళన వద్దు: అచ్చెన్న

AP: ఆక్వా రంగంపై ట్రంప్ టారిఫ్లు తాత్కాలికమేనని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఆక్వా రంగంపై రైతులు, నిపుణులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘ఆక్వా రంగాన్ని అమెరికా సుంకాలు ఇబ్బంది పెట్టవు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని తిరిగి గాడిలో పెడతాం’ అని ఆయన భరోసా ఇచ్చారు.
News April 7, 2025
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 చొప్పున ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46, డీజిల్ ధర రూ.95.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.63, డీజిల్ ధర రూ.97.47గా కొనసాగుతోంది