News May 20, 2024

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సై.. సస్పెన్షన్

image

AP: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన SI తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజాబాబుకు ప్రకాశం(D) కురిచేడులో ఓటు ఉంది. SIతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. SIకి ఆన్‌లైన్‌లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో SIకి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 8, 2025

డెయిరీఫామ్‌తో నెలకు రూ.1.25 లక్షల ఆదాయం

image

స్త్రీలు కూడా డెయిరీఫామ్ రంగంలో రాణిస్తారని నిరూపిస్తున్నారు హిమాచల్‌ప్రదేశ్‌లోని తుంగల్ లోయకు చెందిన సకీనా ఠాకూర్. పీజీ పూర్తి చేసిన ఈ యువతి కుటుంబం వద్దన్నా ఈ రంగంలో అడుగుపెట్టారు. తన ఫామ్‌లో ఉన్న 14 హెచ్‌ఎఫ్ ఆవుల నుంచి రోజూ 112 లీటర్ల పాలను విక్రయిస్తూ.. నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. సకీనా సక్సెస్ వెనుక కారణాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News December 8, 2025

DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)లో 38 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరుతేదీ. టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/

News December 8, 2025

నాణ్యత లేని పాల వల్లే డెయిరీఫామ్ వైపు అడుగులు

image

మండి నగరంలో పాల నాణ్యత పట్ల అసంతృప్తితోనే సకీనా ఈ రంగంలోకి అడుగు పెట్టారు. స్థానిక పాడి రైతు చింతాదేవి, YouTubeలోని పాడిపరిశ్రమలో రాణిస్తున్న వారి అనుభవాలను తెలుసుకొని ముందుకుసాగారు. 2024లో తన దగ్గర ఉన్న రూ.1.25 లక్షలు, బ్యాంకు నుంచి రూ.2లక్షల రుణంతో.. పంజాబ్‌ నుంచి హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్(HF) ఆవులను కొని ఫామ్ ప్రారంభించారు. తొలుత తక్కువ ఆవులే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 14కు చేరింది.