News February 26, 2025
అహ్మదాబాద్ తరహాలో అమరావతిలో స్టేడియం: లోకేశ్

AP: అహ్మదాబాద్ మాదిరి అమరావతిలోనూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ కోసం తాను దుబాయ్ వెళ్లానని, ఆ సమయంలో మన జట్టుకు సపోర్ట్ చేయడంతో పాటు స్టేడియం నిర్మాణం, సీటింగ్ తదితరాలను పరిశీలించి జైషాతో మాట్లాడానన్నారు. దీనిపై కూడా YCP వాళ్లు తనను ట్రోల్ చేశారని వివరించారు.
Similar News
News March 22, 2025
అంతరిక్ష కేంద్రం భూమిపై కూలుతుందా?

ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు వేదికైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూమి నుంచి 415 కి.మీల ఎత్తులో ఉంది. 2031లో ఈ ISS మిషన్ పూర్తవనుంది. దీంతో 109 మీటర్ల పొడవున్న ISS తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి దిశగా రానుంది. ఈక్రమంలో అట్మాస్పిరిక్ డ్రాగ్ ప్రభావంతో ISS తనంతట తాను ధ్వంసం అయ్యేలా NASA చేయనుంది. మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని ‘పాయింట్ నెమో’ (అంతరిక్ష వ్యర్థాల వాటిక)లో పడేలా చేస్తారు.
News March 22, 2025
డీలిమిటేషన్పై ప్రధాని మోదీకి జగన్ లేఖ

AP: డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని మోదీని మాజీ CM జగన్ కోరారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే సౌత్ భాగస్వామ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలు అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు. LS, RSలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు.
News March 22, 2025
IPL: ఆర్సీబీపై KKRదే డామినేషన్

నేటి నుంచి 65 రోజుల పాటు ఐపీఎల్ 2025 జరగనుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగనుండగా ఇరు జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. వీటిలో 20 సార్లు KKR విజయం సాధించగా ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. చివరి సారిగా ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచులో కేకేఆర్ గెలుపొందింది. రెండింటి మధ్య జరిగిన మ్యాచుల్లో కోహ్లీ(962) అత్యధిక పరుగులు చేశారు. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు డామినేట్ చేస్తుందో చూడాలి.