News December 8, 2024
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్!
‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద <<14793383>>తొక్కిసలాటలో మహిళ<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్తో పాటు అతని టీమ్పైనా కేసు నమోదైంది.
Similar News
News January 21, 2025
IOC ప్రెసిడెంట్తో ICC ఛైర్మన్ జై షా
ఐఓసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్తో ఐసీసీ ఛైర్మన్ జై షా న్యూజిలాండ్లో మరోసారి సమావేశమయ్యారు. ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్లోనే క్రికెట్ను చేర్చాలని జై షా పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ఇటీవల ఆస్ట్రేలియాలోనూ 2032 బ్రిస్బేన్ ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్తో జై షా భేటీ అయ్యారు.
News January 21, 2025
‘నా భార్య టార్చర్ పెడుతోంది.. చనిపోతున్నా’
భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. ఇండోర్(MP)కు చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకున్నా తన భార్య హర్ష, అత్త, భార్య సోదరీమణులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాశాడు. ‘మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా’ అని తెలిపాడు. యువకులు పెళ్లి చేసుకోవద్దని, ఒకవేళ చేసుకుంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవాలని పేర్కొన్నాడు.
News January 21, 2025
బ్రాండ్ వాల్యూ పరంగా ప్రపంచంలో పెద్ద ఐటీ కంపెనీలు
*యాక్సెంచర్ (అమెరికా)- రూ.3.47 లక్షల కోట్లు
*టీసీఎస్ (భారత్)- రూ.1.77 లక్షల కోట్లు
*ఇన్ఫోసిస్ (భారత్)- రూ.1.36 లక్షల కోట్లు
*ఐబీఎం కన్సల్టింగ్ (అమెరికా)- రూ.85వేల కోట్లు
*NTT DATA (జపాన్)- రూ.83వేల కోట్లు
*క్యాప్జెమినీ (ఫ్రాన్స్)- రూ.82వేల కోట్లు
*కాగ్నిజెంట్ (అమెరికా)- రూ.75వేల కోట్లు
*HCL టెక్ (భారత్)- రూ.74వేల కోట్లు
*విప్రో (భారత్)- రూ.50వేల కోట్లు
*Fujitsu (జపాన్)- రూ.34వేల కోట్లు