News March 17, 2024
ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష..

ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి, కదిరి ఆర్డిఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణ తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
Similar News
News April 6, 2026
నేడు అనంతలో సీఎం పర్యటన.. సాగునీటి భద్రతపై రైతులతో చర్చ

జిల్లాలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించనున్నారు. యాడికిలో ‘సాగునీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు. హంద్రీనీవా కాలువ ప్రయోజనాలు, నీటి నిర్వహణపై చర్చించి, సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికను అందించనున్నారు. పెండేకల్లు రిజర్వాయర్ వద్ద ‘హాఫ్ మూన్’ వ్యవసాయ విధానాన్ని పరిశీలించనున్నారు. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
News April 6, 2026
నేడు అనంతలో సీఎం పర్యటన.. సాగునీటి భద్రతపై రైతులతో చర్చ

జిల్లాలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించనున్నారు. యాడికిలో ‘సాగునీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు. హంద్రీనీవా కాలువ ప్రయోజనాలు, నీటి నిర్వహణపై చర్చించి, సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికను అందించనున్నారు. పెండేకల్లు రిజర్వాయర్ వద్ద ‘హాఫ్ మూన్’ వ్యవసాయ విధానాన్ని పరిశీలించనున్నారు. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
News April 6, 2026
పోలీస్ PGRS రద్దు: అనంతపురం ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన పోలీస్ PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా పోలీస్ PGRS కార్యక్రమానికి అర్జీదారులు ఎవరూ రాకూడదని సూచించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా బందోబస్తు, విధుల దృష్ట్యా PGRSను రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.


