News March 17, 2024

ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష..

image

ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి, కదిరి ఆర్డిఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణ తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Similar News

News January 27, 2026

సైక్లింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం.. ఉరవకొండ యువకుడి విజయం

image

ఉరవకొండకు చెందిన సురేశ్ బాబు సైక్లింగ్‌లో ప్రతిభతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. సురేశ్ చదువు కొనసాగించే అవకాశం లేకపోవడంతో పదో తరగతితోనే క్రీడలపై దృష్టి పెట్టాడు. విశాఖలో సైక్లింగ్ అకాడమీలో శిక్షణ పొంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. 2023లో మలేషియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో టాప్-10లో నిలిచాడు. క్రీడా కోటాలో ఐటీబీపీలో ఉద్యోగం పొంది ప్రస్తుతం హరియాణా పంచకులలో శిక్షణ పొందుతున్నాడు.

News January 26, 2026

అండమాన్ జైలును సందర్శించిన MP అంబికా

image

మూడు రోజుల అండమాన్ పర్యటనలో సెల్యులార్ జైలును సందర్శించడం తీవ్ర భావోద్వేగాన్ని కలిగించిందని అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకున్నట్లు తెలిపారు. గొప్ప దేశభక్తులకు నివాళులు అర్పించే అవకాశం లభించడం అదృష్టమని అన్నారు. జైలు గదులు, గోడలు అమర వీరుల త్యాగాలకు మూగ సాక్షులుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

News January 26, 2026

ప్రధాని నోట అనంతపురం మాట.. మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు

image

మన్ కీ బాత్‌లో అనంతపురం ‘అనంత నీరు సంరక్షణ ప్రాజెక్టు’ను ప్రశంసించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 10కి పైగా రిజర్వాయర్ల పునరుద్ధరణ, 7 వేల మొక్కలు నాటడం వంటి ప్రజల సామూహిక కృషిని ప్రధాని గుర్తించడం గర్వకారణమని లోకేశ్ ట్వీట్ చేశారు. నీటి భద్రత కోసం అనంతపురం జిల్లా ప్రజలు చేస్తున్న పోరాటం జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.