News December 15, 2024
YCP హయాంలో రాష్ట్రం తిరోగమనం: చంద్రబాబు

AP: ప్రజలకు మంచి చేసే వ్యక్తులను, చెడు చేసే వ్యక్తులను గుర్తుంచుకోవాలని CM చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవంలో CM మాట్లాడారు. ‘2019-24 మధ్య రాష్ట్రాన్ని YCP నిర్వీర్యం చేసింది. అమరావతి, పోలవరాన్ని నాశనం చేసింది. ప్రజల నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ ఐదేళ్లు ప్రజలకు స్వేచ్ఛ లేదు. కానీ ప్రజలను హ్యాపీగా ఉంచడమే మా ధ్యేయం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
APPY NOW: జమ్మూ సెంట్రల్ వర్సిటీలో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో 5 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికే ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్సైట్: https://cujammu.ac.in/
News November 16, 2025
మరోసారి బిహార్ CMగా నితీశ్!

జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి బిహార్ CMగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 19 లేదా 20న ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. PM మోదీ షెడ్యూల్ బట్టి తుది తేదీ నిర్ణయించనున్నారు. 89 సీట్లు గెలిచిన బీజేపీకి 15/16, 85 స్థానాల్లో విజయం సాధించిన JDUకు 14, లోక్ జన్శక్తి పార్టీకి 3 చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటివరకు 9 సార్లు CMగా ప్రమాణం చేశారు. 20 ఏళ్లు పదవిలో ఉన్నారు.
News November 16, 2025
పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.


