News April 28, 2024
మెట్రో విస్తరణకు అడుగులు!

TG: మెట్రో రైలు విస్తరణకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎయిర్ పోర్టుకు మెట్రో విస్తరణకు సాధ్యసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నాగోలు నుంచి చంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయానికి చేరుకునే మార్గంలో మెట్రో ఎండీ NVS రెడ్డి పర్యటించారు. స్థల సేకరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణం, ఫ్లైఓవర్లపై ఎదురయ్యే సవాళ్లను పరిశీలించారు. జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News July 11, 2025
BJP రామచంద్రా.. భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

AP రాష్ట్రం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే BJP రామచంద్రా నోరు తెరవరేం అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మాజీ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు. తమ భాగస్వామ్య ప్రభుత్వం చేరలో ఉన్నామని వదిలేస్తున్నారా అని మండిపడ్డారు. ప్రధాని మోదీతో మాట్లాడతారో లేదా మీ దోస్తు(చంద్రబాబు నాయుడు) దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. ఆక్రమణల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.