News September 2, 2024

రేపు ఉదయానికి రైళ్లు నడిపేలా చర్యలు: SCR జీఎం

image

TG: మహబూబాబాద్‌లో ధ్వంసమైన <<13990198>>రైల్వేట్రాక్<<>> మరమ్మతులు ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. పనులకు వరద ప్రవాహం ఆటంకం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు ఉదయం కల్లా రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు. కాగా మరమ్మతు పనుల్లో 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు పాల్గొనగా 15 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News December 7, 2025

గురుస్వాముల పాత్ర ఏంటో తెలుసా?

image

గురుస్వామి త్రికరణశుద్ధితో, నిష్కళంక మనస్సుతో ఉంటారు. శాంతి, సత్యం, సమానం వంటి దైవ గుణాలతో మెలుగుతారు. దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిగ్రహం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇతరుల భక్తిని, సేవను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తారు. అయ్యప్ప సేవలో నిమగ్నమై, ఇతరుల పొరపాట్లను దండించకుండా క్షమిస్తారు. భక్తులకు దీక్షా నియమాలను స్పష్టంగా తెలుపుతూ, అన్ని విధాలా సహాయం చేస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News December 7, 2025

రోహిత్, కోహ్లీలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

image

ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో పరుగుల వరదతో అభిమానులను అలరించిన రో-కో జోడీ మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో మైదానంలో అడుగుపెట్టనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ సిరీస్ తర్వాత మళ్లీ జులైలో ENGతో మూడు వన్డేలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడనున్నారు.

News December 7, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

⋆ కాంగ్రెస్ పాలనపై ‘ప్రజా వంచన దినం’ పేరిట HYD ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ధర్నా.. హామీలపై చర్చకు రావాలని CM రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్
⋆ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. MLAల అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
⋆ ఈనెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షనా? CM జోక్యం చేసుకుని పరీక్షను వాయిదా వేయించాలి: కవిత