News January 27, 2025

Stock Market: నేలచూపులు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు Mon భారీగా న‌ష్ట‌పోయాయి. Sensex 824 PTS న‌ష్ట‌పోయి 75,366 వ‌ద్ద‌, Nifty 263 PTS ప‌త‌న‌మై 22,829 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. అధిక వెయిటేజీ రంగాలైన ఐటీ, బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఫార్మా, రియ‌ల్టీ రంగాలు నేల‌చూపులు చూశాయి. India Vix 18.14గా న‌మోద‌వ్వ‌డం కీల‌క రంగాల్లో అమ్మ‌కాల ఒత్తిడిని ప్ర‌తిబింబిస్తుంది. Britannia, ICICI, M&M టాప్ గెయినర్స్. HCL, TechM, Wipro టాప్ లూజర్స్.

Similar News

News February 13, 2025

కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్

image

TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రేపు మ.2 గంటలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.

News February 13, 2025

మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్

image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చిలో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల మిషన్‌ కోసం వెళ్లి సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె మార్చి మధ్యలో రానున్నట్లు NASA తెలిపింది. సునీతతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నట్లు పేర్కొంది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని వెల్లడించింది.

News February 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్షలకు వచ్చే సమయంలో హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని APPSC స్పష్టం చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లలో 89,900 మంది పరీక్ష రాయనున్నారు.

error: Content is protected !!