News October 7, 2024
Stock Market: మళ్లీ నష్టాలు

FIIల అమ్మకాలు, మిడిల్ ఈస్ట్లో యుద్ధ భయాలతో బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం కూడా భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద, నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 24,795 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం గ్యాప్ అప్తో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. 24,800 వద్ద నిఫ్టీకి మద్దతు దొరికినా 25,000 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్ సూచీని మళ్లీ నష్టాల్లోకి నెట్టింది.
Similar News
News February 18, 2026
టెన్త్ పరీక్షల గ్యాప్లోనూ క్లాసులు!

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
News February 18, 2026
ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
News February 18, 2026
ప్రకృతి వ్యవసాయంలో APCNF కీలక పాత్ర

రైతులను రసాయన రహిత వ్యవసాయంవైపు నడిపించాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం APCNF(Andhra Pradesh Community Managed Natural Farming) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన సేద్యం కాకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.


