News December 30, 2024

STOCK MARKET: నష్టాలతో మొదలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు నష్టపోయి 78,500 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 23,760 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ పోర్ట్స్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇన్ఫీ, మారుతీ, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్, నెస్లే ఇండియా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News January 13, 2025

నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్

image

హీరోయిన్ అన్షు గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావుపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు త్వరలోనే నోటీసు జారీ చేస్తామని ఛైర్‌పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు. కాగా ‘అన్షు మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా. తెలుగుకు సరిపోదు. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా’ అని త్రినాథరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News January 13, 2025

INDvsPAK క్రికెట్ పోరుపై డాక్యుమెంటరీ

image

క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే దానినో యుద్ధంలా చూస్తారు. క్రికెట్ చరిత్రలో దాయాదుల పోరు గురించి NETFLIX ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేందుకు వెళ్తోన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. INDvsPAK మ్యాచుల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.

News January 13, 2025

అక్షరాస్యత రేటులో 1% వృద్ధితో 25% పెరిగిన మహిళల ఓటింగ్

image

అక్షరాస్యత రేటులో ఒకశాతం పెరుగుదల మహిళల ఓటింగును 25% పెంచిందని SBI నివేదిక పేర్కొంది. 2019తో పోలిస్తే 2024లో 1.8 కోట్ల మహిళా ఓటర్లు పెరిగారు. అందులో 45 లక్షల వృద్ధికి అక్షరాస్యతే కారణమంది. ముద్రా వంటి స్కీములతో 36లక్షలు, పారిశుద్ధ్యం వల్ల 21లక్షలు, PMAY వల్ల 20లక్షల స్త్రీ ఓటర్లు పెరిగారని తెలిపింది. అక్షరాస్యత, ఉపాధి, గృహ యాజమాన్యం, విద్యుత్, నీరు వంటివి సానుకూల ప్రభావం చూపాయని వెల్లడించింది.