News January 28, 2025
Stock Market: ఈ రోజు లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. గత సెషన్లో ఎదురైన నష్టాల నుంచి సూచీలు ఒకింత ఉపశమనం పొందాయి. సెన్సెక్స్ 535 పాయింట్ల లాభంతో 75,901 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు ఎగసి 22,957 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో బీఎస్ఈ సూచీ 900 PTS, నిఫ్టీ 220 పాయింట్లు ఎగసినా కొనుగోళ్లలో అస్థిరత వల్ల తదుపరి రివర్సల్ తీసుకున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, రియల్టీ షేర్లు రాణించాయి.
Similar News
News December 8, 2025
‘వారణాసి’కి మహేశ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

రాజమౌళి ‘వారణాసి’ చిత్రం కోసం మహేశ్ బాబు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మూవీ పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో మొత్తం రూ.150-200 కోట్లు తీసుకుంటారని సమాచారం. సాధారణంగా మహేశ్ ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటారని టాక్. కాగా ‘వారణాసి’ 2027 మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
News December 8, 2025
రూర్బన్ పంచాయతీలుగా 359 గ్రామాలు

AP: 10వేల జనాభా, కోటికి పైగా ఆదాయమున్న359 గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా ప్రభుత్వం మార్చనుంది. CM CBN సూచనలతో వీటిని ఏర్పాటు చేస్తోంది. పట్టణ తరహా సదుపాయాలను వీటిలో కల్పించనుంది. నిబద్ధత కలిగిన Dy MPDOలను వీటికి కార్యదర్శులుగా నియమిస్తారు. ప్రతి 4 జిల్లాలకు కలిపి ZP CEO స్థాయిలో పర్యవేక్షణాధికారిని ఏర్పాటు చేస్తారు. MNPల మాదిరి వివిధ కార్యక్రమాలకోసం నాలుగు విభాగాల సిబ్బందిని కూడా నియమించనున్నారు.
News December 8, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.


