News April 4, 2025

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల భయాలు, మాంద్యం ఆందోళనలతో అమెరికాలో మదుపర్లు భారీగా విక్రయించారు. దీంతో అక్కడి సూచీలు 5ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా సింగిల్-డే నష్టాల్ని నమోదు చేశాయి. భారత మార్కెట్లూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 75,364 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 345 పాయింట్ల నష్టంతో 22,904 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

Similar News

News April 20, 2025

వక్ఫ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర: ఒవైసీ

image

వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేదే లేదని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ దారుసలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో ముస్లింల సమాధులకూ స్థలాలు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుంచి నిరసనలు చేపడతామన్నారు.

News April 20, 2025

థ్రిల్లింగ్ విక్టరీ.. అద్భుతం చేసిన ఆవేశ్

image

నిన్న LSGతో మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన RR మొదటి నుంచీ గెలుపు దిశగానే సాగింది. 17 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ 156/2. 18 బంతుల్లో 25 రన్స్ కావాలి. అంతా విజయం ఖాయమనుకున్నారు. అయితే LSG బౌలర్ ఆవేశ్ ఖాన్ అద్భుతం చేశారు. 18వ ఓవర్‌లో జైస్వాల్, పరాగ్‌ను ఔట్ చేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. చివరి ఓవర్‌లో RRకు 9 రన్స్ కావాల్సి ఉండగా 6 పరుగులే ఇచ్చి హెట్మైర్ వికెట్ కూల్చి LSGకి విక్టరీ అందించారు.

News April 20, 2025

వారికి పెన్షన్ పునరుద్ధరణ?

image

TG: రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.24లక్షల మంది పెన్షన్‌దారులు సొంతూళ్ల నుంచి వలస వెళ్లినట్లు సెర్ప్ గుర్తించింది. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే అధికారులు జాబితా నుంచి పేరు తొలగిస్తున్నారు. అలాంటి వారు సొంతూరుకు వస్తే పెన్షన్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పెన్షన్ అందుతోంది.

error: Content is protected !!