News April 7, 2025

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. 2,226 పాయింట్ల నష్టంతో sensex 73,137 పాయింట్ల వద్ద, 742 పాయింట్ల నష్టంతో nifty 22,161 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.16 లక్షల కోట్లు నష్టపోయారు. ట్రెంట్, టాటా స్టీల్, JSW స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎయిర్‌టెల్, AXIS, HDFC, ICICI, ITC షేర్లు భారీగా నష్టపోయాయి.

Similar News

News April 25, 2025

BREAKING: కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్!

image

నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ సీజ్ ఫైర్‌ను ఎత్తేశాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.

News April 25, 2025

ఉద్రిక్తతల వేళ.. భారీ యుద్ధ విన్యాసం

image

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్టార్‌లో ‘ఆపరేషన్ ఆక్రమణ్’ పేరుతో భారీ స్థాయి వైమానిక దళ విన్యాసం చేపట్టింది. భారత్‌కు చెందిన అగ్రశేణి ఫైటర్ జెట్స్‌తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. భూఉపరితలంతో పాటు కొండ ప్రాంతాలలో దాడి చేసేలా డ్రిల్ నిర్వహించారు. దీర్ఘ, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసేలా పైలట్లు విన్యాసం చేపట్టారు.

News April 25, 2025

సమ్మర్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బీర్ల సేల్స్

image

TG: రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు రెట్టింపయ్యాయి. సమ్మర్ సీజన్‌కు తోడు ఐపీఎల్ ఉండటంతో రోజుకు 3లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. IPL ప్రారంభమైన మార్చి 22వరోజు ఏకంగా 4లక్షల కాటన్‌ల బీర్లు సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. పెరిగిన డిమాండ్ తీర్చడానికి బీర్ సరఫరా సంస్థలు సైతం ఉత్పత్తిని పెంచాయి. లిక్కర్ అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది.

error: Content is protected !!