News July 11, 2024
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. ఓ దశలో 400కుపైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా కోలుకుంది. 79,897 (-27) వద్ద ట్రేడింగ్ను ముగించింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,315 వద్ద స్థిరపడింది. ONGC, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Similar News
News November 3, 2025
హైదరాబాద్లో వర్షం షురూ..

TG: హైదరాబాద్లో వర్షం మొదలైంది. కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్పేట్, హిమాయత్నగర్, ట్యాంక్బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 3, 2025
స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.
News November 3, 2025
ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామనడం సరికాదు: ఒవైసీ

బిహార్ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామన్న విమర్శలను MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘2020లో 5 సీట్లు గెలిచాం. పోటీచేసిన మిగతా 14లో 9 MGB గెలిచింది. 2024లో కిషన్గంజ్ MP సీటులో 2 లక్షలకుపైగా ఓట్లు సాధించాం. మేం ఆ ఒక్క సీట్లో పోటీచేసినా BJP అనేక చోట్ల గెలిచింది’ అని తెలిపారు. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికే తమ పోటీ అన్నారు. ఈసారి MIM 24చోట్ల పోటీ చేస్తుంది.


