News November 21, 2024
STOCK MARKETS: ఎంత నష్టపోయాయంటే!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా కోర్టులో అదానీపై కేసులు, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు పెరగడమే ఇందుకు కారణాలు. సెన్సెక్స్ 77,155 (-422), నిఫ్టీ 23,349 (-168) వద్ద క్లోజయ్యాయి. ADANIENT, ADANI PORTS, SBILIFE, SBI, NTPC టాప్ లూజర్స్. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. IT, REALTY సూచీలు పుంజుకున్నాయి.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.
News April 20, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.
News April 20, 2026
ఇక నుంచి యాక్టివ్గా కేసీఆర్!

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.


