News May 3, 2024
నష్టాల ఊబిలో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 1030 పాయింట్లు నష్టపోయి 73,574కు చేరింది. మరోవైపు నిఫ్టీ 267 పాయింట్లు కోల్పోయి 22,380కి క్షీణించింది. అన్ని రంగాలు నష్టాలను నమోదు చేయడంతో అది మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. మార్కెట్ విలువ ఏకంగా రూ.2.67లక్షల కోట్లు క్షీణించి రూ.405.83లక్షల కోట్లకు చేరింది.
Similar News
News January 24, 2026
ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 24, 2026
‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.
News January 24, 2026
పేర్ని నాని – అనగాని మధ్య డైలాగ్ వార్

AP: మంత్రి అనగాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సంస్కారహీనుడు, మతిస్తిమితం లేని మంత్రి రెవెన్యూ శాఖకు ఉండటం ప్రజల కర్మ. ఆయన అడిగిన రూ.25 కోట్లు జగన్ ఇచ్చుంటే ఇవాళ నా పక్కన ఉండేవారు’ అని పేర్ని నాని విమర్శించారు. అటు ‘తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగే డ్యాష్లు ఇంకా పిచ్చి మాటలు మానుకోలేదు. నా రేటేంటో వాడు చెప్పేది ఏంటి? వాడి బతుకేంటో నాకు తెలుసు’ అని అనగాని తీవ్రంగా స్పందించారు.


