News December 31, 2024
2024కు గుడ్బై చెప్పిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు 2024కు ఫ్లాట్గా వీడ్కోలు పలికాయి. సెన్సెక్స్ 78,139(-109) వద్ద, నిఫ్టీ 23,644(-0.10) పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఐటీ షేర్లు అత్యధికంగా 1.14% నష్టపోయాయి. మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, ఆయిల్&గ్యాస్ షేర్లకు కొత్త ఏడాదికి ముందు కొనుగోళ్ల మద్దతు లభించింది. Bel, Ongc, Kotak Bank టాప్ గెయినర్స్. Adani Ent, Tech Mahindra, TCS టాప్ లూజర్స్.
Similar News
News January 22, 2025
ఐటీ సోదాలు అందరిపై జరుగుతున్నాయి: దిల్ రాజు
హైదరాబాద్లోని తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు. నిన్నటి నుంచి SVC, మైత్రి మూవీస్తో పాటు పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
News January 22, 2025
BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.
News January 22, 2025
నోటిఫికేషన్ వచ్చేసింది..
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <