News January 7, 2025
Stock Markets: కొంత తేరుకున్నాయ్!
స్టాక్మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి నష్టాల నుంచి కొంత తేరుకున్నాయి. నిఫ్టీ 23,683 (+70), సెన్సెక్స్ 78,069 (+101) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్ 400, నిఫ్టీ 140 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు తగ్గడం పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. IT, MEDIA, AUTO షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
Similar News
News January 17, 2025
ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్
IND యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. UPకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో తాజాగా ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో వీరికి సహచర క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియా సరోజ్ ఇటీవల మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీంకోర్టు లాయర్గా పనిచేశారు. తండ్రి 3 సార్లు ఎంపీగా గెలిచారు.
News January 17, 2025
BIG BREAKING: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు
AP: 14వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘గత ప్రభుత్వం వాటిలో 11 మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. ఇకపై 3,500+ జనాభా పరిధి ఉన్న సచివాలయంలో 8 మంది, 2,500+ ఉన్న చోట ఏడుగురిని, మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని ఉంచుతాం. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్గా ఉంటారు’ అని పేర్కొన్నారు.
News January 17, 2025
ప్రకృతి విలయం నుంచి తేరుకునేందుకు దశాబ్దం!
అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల రూ.లక్షల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వినాశకర కార్చిచ్చు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఒక దశాబ్ద కాలం పట్టొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల మౌలిక సదుపాయాలు, గృహాలు & ప్రకృతికి విస్తృతమైన నష్టం వాటిల్లింది. పురోగతి క్రమంగా ఉన్నప్పటికీ, అధికారులు నగరాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి.