News January 1, 2025
మధ్యాహ్నం దూకుడు పెంచిన స్టాక్మార్కెట్లు..

ఉదయం ఫ్లాటుగా మొదలైన బెంచ్మార్క్ సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. ప్రస్తుతం భారీ లాభాల్లో చలిస్తున్నాయి. సెన్సెక్స్ 78,490 (+353), నిఫ్టీ 23,738 (+94) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, IT, BANKING షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. తక్కువకే దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. 2025లో ఔట్లుక్ మెరుగ్గా లేకపోవడంతో అప్రమత్తత పాటిస్తున్నారు. M&M, LT, ASIAN PAINTS టాప్ గెయినర్స్.
Similar News
News January 1, 2026
కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

రష్యా నియంత్రణలోని ఖేర్సన్లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.
News January 1, 2026
ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉద్యోగాలు

<
News January 1, 2026
భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

డెహ్రాడూన్లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్గఢ్లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.


