News February 4, 2025
Stock Markets: తేడా 0.3 శాతమే

భారత స్టాక్మార్కెట్లపై DIIs పట్టు పెరుగుతోంది. పెట్టుబడుల పరంగా FIIsతో పోలిస్తే 0.3 శాతమే వెనుకంజలో ఉన్నారు. NSEలో ఫారిన్ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 12 నెలల కనిష్ఠమైన 17.23 శాతానికి పడిపోయాయి. మరోవైపు DIIs హోల్డింగ్స్ 16.9 శాతానికి చేరాయి. ఇక MFs హోల్డింగ్స్ జీవితకాల గరిష్ఠమైన 9.9% వద్ద ఉన్నాయి. 2015లో మన మార్కెట్లలో FIIs పెట్టుబడులు DIIs కన్నా రెట్టింపు ఉండేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది.
Similar News
News January 16, 2026
ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
News January 16, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పోస్టులు

బరక్పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 16, 2026
కనుమ రోజు మాంసాహారం తీసుకోకూడదా?

ఆధ్యాత్మికపరంగా కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పశువులను దైవంగా భావించి పూజిస్తారు కాబట్టి మాంసాహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘మొదటి మూడు రోజులు శాకాహారంతో దైవచింతనలో గడపడం శ్రేయస్కరం. మాంసాహార ప్రియులు నాలుగవ రోజైన ‘ముక్కనుమ’ నాడు తమకు ఇష్టమైన వంటకాలను వండుకుని తింటారు. కనుమ రోజున పశువుల పట్ల కృతజ్ఞత చూపిస్తూ, శాకాహార నియమాన్ని పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


