News February 11, 2025

Stock Markets: మళ్లీ తప్పని విలవిల..

image

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లోనే మొదలయ్యాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ టారిఫ్స్ విధించడమే ఇందుకు కారణం. మరోవైపు డాలర్ విలువ పెరుగుదల సెంటిమెంటును దెబ్బతీసింది. నిఫ్టీ 23, 293 (-88), సెన్సెక్స్ 77,025 (-285) వద్ద ట్రేడవుతున్నాయి. IT షేర్లు బలం ప్రదర్శిస్తున్నాయి. ఫైనాన్స్, BANK, మీడియా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G షేర్లు ఎరుపెక్కాయి. ADANIENT, GRASIM, APSEZ టాప్ గెయినర్స్.

Similar News

News March 19, 2025

అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా

image

TG: అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది. ఇరు సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కానుంది.

News March 19, 2025

పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంది?

image

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. అయితే, ఏడాదంతా కాలేజీలకు వెళ్లిన వేలాది స్టూడెంట్స్ పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. తొలి పరీక్షను ఏకంగా 17వేల మంది రాయలేదు. నిన్న ఫిజిక్స్ & ఎకనామిక్స్ పరీక్షలు జరగ్గా 13,403 మంది డుమ్మా కొట్టారు. పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాను రాను విద్యార్థులు చదువును మరింత నెగ్లెక్ట్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

News March 19, 2025

కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

image

TG బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఇందిర గిరి జల వికాసం’ పేరుతో నూతన స్కీమును అమలు చేయనున్నట్లు తెలిపింది. పోడుభూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది. నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ.12,600 కేటాయిస్తామని పేర్కొంది.

error: Content is protected !!