News August 8, 2024
అనవసర ప్రయోగాలు మానేయండి.. గంభీర్పై విమర్శలు

భారత క్రికెట్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్లోనే టీమ్ఇండియా ఘోరంగా ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్ కోల్పోవడంతో గంభీర్పై విమర్శలొస్తున్నాయి. ఇతరులకంటే భిన్నంగా ఉండేందుకు అనవసర ప్రయోగాలు చేయడం మానేయాలని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. బౌలర్లతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేపిస్తే 8,9 డౌన్లోనూ కొన్ని పరుగులైనా వస్తాయని అభిప్రాయపడుతున్నారు. మీ కామెంట్?
Similar News
News December 12, 2025
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు
News December 12, 2025
అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.
News December 12, 2025
రేవంత్-మెస్సీ మ్యాచ్కు రాహుల్ గాంధీ

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శనివారం) హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్లో స్టార్ ప్లేయర్ మెస్సీ పాల్గొనే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించనున్నారు. ఈ మ్యాచ్ను చూసేందుకు రావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్, ప్రియాంక ఇతర నేతలను ఆహ్వానించడం తెలిసిందే. ఈ మ్యాచులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆటగాళ్లు మెస్సీ టీమ్తో పోటీపడనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.


