News March 7, 2025
‘ప్లాస్టిక్’ నిషేధానికి కఠిన చర్యలు: CS

AP: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూడో శనివారం GOVT ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర దివస్ నిర్వహించాలని సూచించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో పనిచేయాలన్నారు. చేనేత, జౌళి శాఖలు, MSMEల భాగస్వామ్యంతో పర్యావరణ హితమైన వస్తువుల తయారీని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: https://surveyofindia.gov.in
News November 11, 2025
యంగ్గా ఉండాలా.. ఎక్కువ భాషలు నేర్చుకో

వయసు పెరుగుతున్నా యంగ్గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఒకే భాషలో మాట్లాడేవారితో పోలిస్తే 2 అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారి మెదడు యవ్వనంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 27 యూరోపియన్ దేశాలలో 51-90 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 80వేల మందిపై జరిపిన స్టడీలో ఇది వెల్లడైంది. ఒకే భాషలో మాట్లాడేవారి మెదడు 2 రెట్లు త్వరగా వృద్ధాప్య దశకు చేరుకుంటున్నట్టు స్పష్టమైంది. లేటెందుకు ఈరోజు నుంచే కొత్త భాష నేర్చుకోండి.
News November 11, 2025
కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. Way2Newsలో వేగంగా..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం విడుదల కానున్నాయి. సా.6.30 గం.కు వివిధ ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. Way2Newsలో వేగంగా వాటిని తెలుసుకోవచ్చు. మరోవైపు ఈ నెల 14న ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.


