News March 7, 2025
‘ప్లాస్టిక్’ నిషేధానికి కఠిన చర్యలు: CS

AP: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూడో శనివారం GOVT ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర దివస్ నిర్వహించాలని సూచించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో పనిచేయాలన్నారు. చేనేత, జౌళి శాఖలు, MSMEల భాగస్వామ్యంతో పర్యావరణ హితమైన వస్తువుల తయారీని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
25 ఏళ్ల వరకూ డీలిమిటేషన్ ఉండొద్దు: స్టాలిన్

తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో డీలిమిటేషన్పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం స్టాలిన్ మాట్లాడారు. ‘25 ఏళ్ల వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించాం. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణలో రెండో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కొన్ని కారణాల వల్ల TMC హాజరు కాలేదు. జగన్ కూడా మా వెంటే ఉన్నట్లు భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.175 కోట్లు?

‘పుష్ప-2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్గా దూసుకెళుతున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో తీసే మూవీకి బన్నీ రూ.175 కోట్లు తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. దీంతోపాటు లాభాల్లో 15% వాటా ఇచ్చేలా ‘సన్ పిక్చర్’తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు టాక్.
News March 22, 2025
BREAKING: 357 బెట్టింగ్ సైట్స్ బ్లాక్

పన్ను ఎగ్గొడుతున్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన DGGI కొరడా ఝుళిపించింది. 357 వెబ్సైట్లను బ్లాక్ చేసింది. ఆయా సంస్థలకు చెందిన 2,400 అకౌంట్లలోని రూ.126 కోట్లను సీజ్ చేసింది. దాదాపు 700 విదేశీ సంస్థలు ఆన్లైన్ గేమింగ్/బెట్టింగ్/గ్యాంబ్లింగ్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.