News January 27, 2025
ఆర్టీసీలో సమ్మె సైరన్

TG: ఆర్టీసీలో ఇవాళ్టి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని పునఃసమీక్షించి, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. నేటి సాయంత్రం 4 గంటలకు బస్భవన్లో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనుంది. కాగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Similar News
News February 19, 2025
విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
News February 19, 2025
CHAMPIONS TROPHY: 12 వేల మందితో భారీ భద్రత!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పీసీబీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం 9 స్పెషల్ చార్టర్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి.
News February 19, 2025
శివాజీ జయంతికి రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి..

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జయంతి వేళ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాయడమే ఇందుకు కారణం. సాధారణంగా వర్ధంతులకే ఇలా చెప్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ శివాజీ విగ్రహాలను తీసుకొనేందుకు ఆయన వెనుకాడటం, నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు యూజర్లు గుర్తుచేస్తున్నారు.