News March 18, 2024
పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: పల్నాడు ఎస్పీ

పల్నాడు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు చేస్తూ, పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
Similar News
News November 13, 2025
10 రోజుల్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి: APTF

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల పీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బసవలింగారావు, ఖాలీద్ గురువారం జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టీనాను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
News November 13, 2025
GNT: 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులపై సమీక్ష

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాల గురించి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా అధ్యక్షత వహించి మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన వర్క్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్పర్సన్ సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
News November 13, 2025
దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు బుధవారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.12,550 పలికాయి. కాయ క్వింటాల్కు కనిష్ఠ ధర రూ.11,200, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.11,800 పలకగా, మొత్తం 308 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.


