News August 25, 2024

ఒకరోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు

image

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒకరోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులే కొట్టి చంపారు. బ్రిజ్‌పురి మదర్సాలో ఓ విద్యార్థి చనిపోయాడని పోలీసులకు సమాచారం వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు చిన్నారులు(ఇద్దరికి 9, ఒకరికి 11 సంవత్సరాలు) హత్య చేసినట్లు గుర్తించారు. తమను అసభ్య పదజాలంతో దూషించేవాడని, చంపితే ఒక రోజు మదర్సాకు సెలవు ఇస్తారని హత్య చేసినట్లు ముగ్గురూ ఒప్పుకున్నారు.

Similar News

News September 17, 2025

మోదీ బయోపిక్.. పోస్టర్ రిలీజ్

image

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రూపొందుతోంది. దీనికి ‘మా వందే’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను క్రాంతి కుమార్‌ సీహెచ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. పోస్టర్‌పై మోదీ సంతకం చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఉండగా.. ‘ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్ప బలం గొప్పది’ అని మోదీ చెప్పిన మాటలను ముద్రించారు.

News September 17, 2025

GST ద్వారా రూ.22లక్షల కోట్ల ఆదాయం: నిర్మల

image

AP: 2017కు ముందు 17రకాల పన్నులు, వాటిపై 8సెస్సులు ఉండేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘అన్నింటినీ కలిపి ఒకే పన్ను, 4 శ్లాబులుగా తీసుకొచ్చిందే GST. 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అప్పుడు 65లక్షల మంది పన్ను చెల్లించేవారు ఉండగా, ప్రస్తుతం 1.51కోట్లకు చేరారు. 2018లో GST ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 నాటికి రూ.22.087లక్షల కోట్లకు చేరింది’ అని తెలిపారు.

News September 17, 2025

BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

image

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.