News May 11, 2024

చందాలేసుకొని అభ్యర్థితో నామినేషన్ వేయించారు!

image

లోక్‌సభ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల్లో భువనగిరి సీటు నుంచి సీపీఎం తరఫున పోటీ చేస్తోన్న ఎండీ జహంగీర్ స్పెషల్. గతంలో జహంగీర్ సర్పంచ్‌గా చేసిన ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఆయన పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించారట. నామినేషన్ కోసం చందాలేసుకొని రూ.25వేలు జమచేసి ఆయనకు అందించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరలవుతోంది.

Similar News

News September 16, 2025

విద్యార్థి తలపై కొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక

image

AP: అల్లరి చేస్తోందని విద్యార్థినిని కొట్టడంతో తలకు తీవ్రగాయమైన ఘటన చిత్తూరు(D) పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది. ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న ఓ టీచర్ స్కూల్ బ్యాగ్‌తో కొట్టాడు. తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 16, 2025

పంటకు అధిక యూరియాతో కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.

News September 16, 2025

ప్రీఎక్లంప్సియాను ముందుగానే గుర్తించొచ్చు!

image

కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీలో మూత్రం నుంచి ప్రొటీన్ వెళ్లిపోతుంది. దీన్నే ప్రీఎక్లంప్సియా అంటారు. సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. దీనికోసం IITమద్రాస్ పరిశోధకులు ఒక టెస్ట్‌కిట్‌ అభివృద్ధి చేశారు. ఒక్కచుక్క రక్తంతో టెస్ట్ చేస్తే అరగంటలోనే ఫలితం వస్తుంది. P-FAB టెక్నాలజీతో ఇది పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ VV రాఘవేంద్రసాయి వెల్లడించారు.