News April 4, 2025
ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీలు: సీఎం

AP: పరిశ్రమల తరహాలోనే ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీలు ఇస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతూ ‘ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలి. PHC, CHCలలో వర్చువల్ వైద్య సేవలు అందించాలి. 13 డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుకు చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.
Similar News
News April 20, 2025
ICICIకి రూ.13,502 కోట్ల నికర లాభం

జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభం వచ్చినట్లు ICICI ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 15.7 శాతం మేర నికర లాభం పెరిగినట్లు తెలిపింది. ఈ 3 నెలల్లో నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లు, వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది.
News April 20, 2025
ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం
News April 20, 2025
ఏం తప్పు చేశామో తెలియట్లేదు: పరాగ్

గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం బాధ కలిగించిందని RR కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పారు. ‘మేం ఏం తప్పు చేశామో తెలియట్లేదు. 18-19 ఓవర్ వరకు మాదే గెలుపు అనుకున్నాం. 19 ఓవర్లోనే మ్యాచ్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఓటమికి నాదే బాధ్యత. అలాగే మా బౌలింగ్లో చివరి ఓవర్ సందీప్ శర్మ ఎక్కువ రన్స్ ఇచ్చారు. అతను మంచి బౌలరే కానీ అతని బ్యాడ్ లక్. సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అని పేర్కొన్నారు.