News October 5, 2025
పెళ్లైన వారానికే సూసైడ్.. కారణమిదే!

TG: జగిత్యాల జిల్లా ఎర్దండిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగోత్రి(22) వారానికే <<17908971>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ రోజు భార్య గంగోత్రితో కలిసి భర్త సంతోష్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మటన్ తింటూ కూరలో కారం లేదని గంగోత్రిని భర్త తిట్టాడు. ఆపై భోజనం చేయకుండా భార్యతో ఇంటికి వచ్చేశాడు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 5, 2025
5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

<
News October 5, 2025
వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

మటన్లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.
News October 5, 2025
బత్తాయిలో ‘తొడిమ కుళ్లు’ తెగులు లక్షణాలు

బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో తొడిమ కుళ్లు తెగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. దీనినే వడప, బొడ్డుకుళ్లు తెగులు అని కూడా అంటారు. కాయ పక్వానికి రాకముందే చిన్న సైజులో ఉన్నప్పుడే తొడిమ నుంచి ఊడి రాలిపోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం. కొమ్మ చివరి భాగాల్లో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఈ తెగులు ప్రభావం ఎక్కువ. చిన్న కాయలుగా ఉన్నప్పుడే రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.