News March 29, 2024
ఈ ఆదివారం వారికి సెలవు లేదు

ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఈ ఆదివారం బ్యాంకు ఉద్యోగులకు సెలవు లేదు. దీంతో మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయనున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్స్కు ఆటంకం లేకుండా ఆర్బీఐ ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకైన డీబీఎస్ బ్యాంక్ ఇండియా కస్టమర్లకు సేవలు అందించనున్నాయి.
Similar News
News January 8, 2026
AP క్యాబినెట్ నిర్ణయాలు

* వైద్యుడు సుధాకర్ ఫ్యామిలీకి రూ.కోటి సహాయం. ఆయన కొడుకు సి.కె.లలిత్ ప్రసాద్కు స్పెషల్ ప్రమోషన్ కింద డిప్యూటీ తహశీల్దార్గా పదోన్నతి
* పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
* పాఠశాల కిట్ల పంపిణీకి రూ.944.53కోట్లకు పరిపాలన అనుమతులు
* ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
* 39.52 లక్షల విద్యార్థులకు పెండింగ్లో పెట్టిన సొమ్ము చెల్లింపునకు ఆమోదం
News January 8, 2026
ఆ పోర్నోగ్రఫీ చూసినా, షేర్ చేసినా జైలుకే!

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారిని TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో ట్రేస్ చేస్తోంది. వీడియోలను చూస్తూ, షేర్ చేస్తున్న ఓ వ్యక్తిని ఖమ్మం పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ ‘సైబర్ టిప్ లైన్’ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ బ్రౌజింగ్పై పోలీసులకు అలర్ట్స్ పంపిస్తుంటుంది. గతేడాది TGకి 97,556 అలర్ట్స్ వచ్చాయి. 854 FIRలు నమోదవగా, 376 మంది అరెస్టయ్యారు.
News January 8, 2026
విజయ్ మూవీ వాయిదా.. టికెట్ మనీ రిఫండ్

తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించకపోవడంతో BMS టికెట్లు కొన్నవారికి రిఫండ్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడైన 4.5లక్షల టికెట్ల అమౌంట్ను తిరిగిచ్చేస్తోంది. దీంతోపాటు ప్రమోషన్లు, థియేటర్ల అగ్రిమెంట్ల రూపంలో మేకర్స్కు రూ.50కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం.


