News January 7, 2025
రాష్ట్ర ప్రభుత్వాల ‘ఆర్థిక పరిమితుల’పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఏ పనీ చేయని వ్యక్తులకు ఉచితాలు ఇవ్వడానికి రాష్ట్రాల వద్ద డబ్బులు ఉంటాయని, అదే జడ్జిలకు జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే పరిమితులపై మాట్లాడుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఎన్నికలొస్తే మహిళలకు ₹2500 ఇస్తామంటూ పథకాలు ప్రకటిస్తారు. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థను ఏర్పరచాలంటే కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి న్యాయమూర్తుల ఆర్థిక స్వతంత్రత అనివార్యం’ అని జస్టిస్ గవాయ్ బెంచ్ పేర్కొంది.
Similar News
News January 14, 2025
GOOD NEWS: సైనిక్ స్కూళ్లు.. దరఖాస్తు గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా NTA మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 23 వరకు గడువును పొడిగించింది. ఆరో క్లాస్కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్కు 13-15ఏళ్లు ఉండాలి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
News January 14, 2025
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
News January 14, 2025
అధికారుల తీరుపై మంత్రి పొన్నం నిరసన
TG: హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాగానే అక్కడి ఏర్పాట్లపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అధికారుల తీరుపై కోపంతో మంత్రి వసతి గృహం వద్ద నేలపై కూర్చున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లలేదు. అనంతరం ప్రెస్మీట్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.