News February 15, 2025

సర్వే: ‘ఇండియా’ కూటమి ఉండాల్సిందే..

image

దేశంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి కొనసాగాల్సిందేనని ఇండియా టుడే-సీ ఓవర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది కోరుకున్నారు. 65% మంది ఈమేరకు అభిప్రాయపడగా 26% మంది అవసరంలేదని తేల్చి చెప్పారు. ఇక కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకి అత్యధికంగా 24శాతం ఓట్లు రాగా 14శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్, అఖిలేశ్ నిలిచారు.

Similar News

News December 28, 2025

Silver.. సారీ..! Stock లేదు!

image

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.

News December 28, 2025

EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(<>ED<<>>)లో 75 కాంట్రాక్ట్ లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. LLB/LLM ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://enforcementdirectorate.gov.in

News December 28, 2025

ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

image

ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం ‘క్యాపిటల్ డోమ్’ పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు QRSAM, VL-SRSAM దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. వినూత్న లేజర్ ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఇవి డ్రోన్లను క్షణాల్లో కూల్చేస్తాయి. ఈ వ్యవస్థతో ఢిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక రక్షణ వలయం ఏర్పడబోతోంది.