News February 15, 2025
సర్వే: ‘ఇండియా’ కూటమి ఉండాల్సిందే..

దేశంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి కొనసాగాల్సిందేనని ఇండియా టుడే-సీ ఓవర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది కోరుకున్నారు. 65% మంది ఈమేరకు అభిప్రాయపడగా 26% మంది అవసరంలేదని తేల్చి చెప్పారు. ఇక కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకి అత్యధికంగా 24శాతం ఓట్లు రాగా 14శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్, అఖిలేశ్ నిలిచారు.
Similar News
News January 22, 2026
సిద్దిపేటకు నేషనల్ అవార్డు!

చెత్త సేకరణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి ISRC(ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్) అవార్డు లభించింది. ITC WOW, ఈశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ, శుక్రవారాల్లో పొడి చెత్త, మిగతా రోజుల్లో తడి చెత్తను క్రమపద్ధతిలో సేకరిస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది. కమిషనర్ అశ్రీత్ కుమార్ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛతలో సిద్దిపేట మరోసారి ఆదర్శంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
News January 22, 2026
మెదక్ నుంచి ఢిల్లీలో పోటీలకు ఎంపిక

మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అదనపు ఎస్పీ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News January 22, 2026
మెదక్ నుంచి ఢిల్లీలో పోటీలకు ఎంపిక

మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అదనపు ఎస్పీ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


