News August 9, 2024
NDA అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ.. ఓట్ల అధ్యయనానికి కమిటీ

AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో CM చంద్రబాబు కమిటీ వేశారు. ఇందులో TDP నుంచి పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, JSP నుంచి పంచకర్ల రమేశ్, BJP నుంచి విష్ణుకుమార్కు అవకాశం దక్కింది. అర్బన్, రూరల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది వీరు CMకు నివేదిక ఇస్తారు.
Similar News
News December 9, 2025
ECIపై అనుమానాలు దురదృష్టకరం: కాంగ్రెస్ MP

ECI తటస్థ వైఖరిపై అనుమానాలు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి అన్నారు. CJI, లోక్సభలో LoP EC కమిటీలో ఉండేలా రిఫామ్స్ తేవాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల్లో SIR చేపట్టడానికి కారణాలను కేంద్రం రాసివ్వాలని డిమాండ్ చేశారు. ‘EVMలు మానిప్యులేట్ అవుతాయని నేను అనడం లేదు. ఆ ఛాన్స్ ఉందని ప్రజలు భావిస్తున్నారు. 100% VVPATలను మ్యాచ్ చేయాలి లేదా బ్యాలెట్ పేపర్లకు వెళ్లాలి’ అని చెప్పారు.
News December 9, 2025
నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

పుణేలోని CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. టెక్నీషియన్కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ అసిస్టెంట్కు రూ.72,000 చెల్లిస్తారు. వెబ్సైట్: http://recruit.ncl.res.in/
News December 9, 2025
చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.


