News March 12, 2025

ముగ్గురు IPSల సస్పెన్షన్ పొడిగింపు

image

AP: ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు IPSల సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాంతిరాణా, సీతారామాంజనేయులు, విశాల్ గున్నీలపై సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. రివ్యూ కమిటీ సిఫార్సు తర్వాత సెప్టెంబర్ 25 వరకు వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వీరు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి.

Similar News

News March 12, 2025

జగన్‌తో తమిళనాడు మినిస్టర్ భేటీ

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌తో తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరుకావాలని జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను స్టాలిన్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

News March 12, 2025

నిలిచిన SBI లావాదేవీలు.. కస్టమర్ల అసహనం

image

దేశ వ్యాప్తంగా SBI ఆన్‌లైన్ సేవలు బంద్ అయ్యాయి. UPI యాప్‌లో SBI అకౌంట్ నుంచి చేస్తున్న లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే SBI అకౌంట్ ఉన్న వారికి చేస్తున్న లావాదేవీలు సైతం ఫెయిల్ అవుతున్నాయి. నిన్న కూడా ఇలాంటి సమస్యే తలెత్తి యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మళ్లీ అదే తరహా సమస్య రావడంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్యే ఎదురైందా? కామెంట్ చేయండి.

News March 12, 2025

చనిపోయిందనుకొని ఖననం చేస్తే.. చివరికి.!

image

మరణించిందని భావించి పూడ్చిపెట్టిన మహిళ తిరిగి లేచిన ఘటన USలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ మూర్ఛ వ్యాధితో చనిపోయిందనుకొని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే, అంత్యక్రియలకు ఆలస్యంగా వచ్చిన తన సోదరి చివరి చూపు చూస్తానని శవపేటికను తెరవాలని కోరారు. దీంతో తవ్వి పేటిక తెరవగా ఆమె లేచి కూర్చొని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించడం గమనార్హం.

error: Content is protected !!