News May 25, 2024
ఓవర్ స్పీడ్తో వెళ్లిన ఇద్దరు లోకోపైలెట్లు సస్పెన్షన్

పరిమితికి మించి స్పీడ్తో రైళ్లను నడిపిన గతిమాన్, మాల్వా ఎక్స్ప్రెస్ లోకోపైలెట్లను రైల్వేశాఖ సస్పెండ్ చేసింది. ఆగ్రా కంటోన్మెంట్ సమీపంలోని జజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో అక్కడ స్పీడ్ను 20 kmలకు తగ్గించారు. కానీ ఇటీవల గతిమాన్(ఢిల్లీ-యూపీ), మాల్వా ఎక్స్ప్రెక్స్(జమ్మూ-MP) 120kmల వేగంతో పరుగులు తీసినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


