News May 25, 2024
ఓవర్ స్పీడ్తో వెళ్లిన ఇద్దరు లోకోపైలెట్లు సస్పెన్షన్

పరిమితికి మించి స్పీడ్తో రైళ్లను నడిపిన గతిమాన్, మాల్వా ఎక్స్ప్రెస్ లోకోపైలెట్లను రైల్వేశాఖ సస్పెండ్ చేసింది. ఆగ్రా కంటోన్మెంట్ సమీపంలోని జజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో అక్కడ స్పీడ్ను 20 kmలకు తగ్గించారు. కానీ ఇటీవల గతిమాన్(ఢిల్లీ-యూపీ), మాల్వా ఎక్స్ప్రెక్స్(జమ్మూ-MP) 120kmల వేగంతో పరుగులు తీసినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు.
Similar News
News February 10, 2025
వీరు త్వరగా ముసలోళ్లు కారు?

అన్ని రక్త వర్గాల్లో కంటే B బ్లడ్ గ్రూప్ వారు నెమ్మదిగా వృద్ధాప్యం పొందుతారని ప్లానెట్ టుడే సర్వే తెలిపింది. మిగతా గ్రూపులతో పోల్చుకుంటే ఈ గ్రూప్ వారు నెమ్మదిగా ముసలోళ్లుగా మారతారని పేర్కొంది. వీరి రక్తంలో కణాల పునరుత్పత్తి, కణజాల మరమ్మతులు మెరుగ్గా ఉండటం వల్ల యవ్వనంగా కనిపిస్తారని తెలిపింది. అలాగే వీరికి సుదీర్ఘ ఆయుర్దాయం కూడా ఉంటుందని వెల్లడించింది.
News February 10, 2025
రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 9, 2025
ఇంగ్లండ్ చెత్త రికార్డు

వన్డేల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 300కు పైగా స్కోర్ చేసి అత్యధిక సార్లు పరాజయం పాలైన జట్టుగా నిలిచింది. 99 మ్యాచుల్లో 28 సార్లు ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్(27), వెస్టిండీస్(23), శ్రీలంక(19) ఉన్నాయి. వన్డే WC 2023 తర్వాత ఇంగ్లండ్కు ఇది వరుసగా నాలుగో సిరీస్ ఓటమి.