News November 13, 2024
5000 ఉద్యోగులకు రూ.9000 కోట్లు పంచిన స్విగ్గీ!

స్విగ్గీ ఉద్యోగులు జాక్పాట్ కొట్టేశారు. ESOP విధానంలో కంపెనీ వారికి షేర్లు కేటాయించినట్టు తెలిసింది. 5000 మంది ఉద్యోగులు రూ.9000 కోట్లమేర పొందబోతున్నారు. అందులో 500 మంది కోటీశ్వరులు అవుతున్నారు. కంపెనీ కో ఫౌండర్స్ శ్రీహర్ష, నందన్ రెడ్డి, ఫణికిషన్, ఫుడ్ మార్కెట్ ప్లేస్ CEO రోహిత్, INSTAMART హెడ్ అమితేశ్, CFO రాహుల్, HR హెడ్ గిరీశ్, CTO మధుసూదన్ సహా మరికొందరికే రూ.1600 కోట్లు దక్కినట్టు సమాచారం.
Similar News
News February 11, 2026
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News February 11, 2026
ఏకాదశి: ఎల్లుండి ఉపవాసం ఉంటున్నారా?

ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే ఆ ఒక్కరోజే కాకుండా మూడ్రోజులు (ఏకాదశి, దశమి, ద్వాదశి) కలిపి ‘హరిత్రయం’ పాటిస్తూ ఉపవాసం ఉండాలంటున్నారు పండితులు. దీనివల్ల అధిక పుణ్యం లభిస్తుందట. నియమాలు.. దశమి నాడే ఉపవాస నియమాలు ప్రారంభించాలి. దశమి రాత్రి అల్పాహారం తీసుకుని, నేలపై పడుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ద్వాదశి ఘడియలు ముగిసేలోపే వ్రత సమాప్తి (పారణ) చేయాలి.
News February 11, 2026
SEBI 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<


