News September 20, 2024

80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!

image

నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.

Similar News

News October 16, 2025

మహిళలు రోజూ గుమ్మడి గింజలు తింటే?

image

గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మహిళలు రోజూ 10 గుమ్మడి గింజలను తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, గర్భధారణ సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. PCOS, థైరాయిడ్, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి.
#ShareIt

News October 16, 2025

దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

image

గతేడాది దీపావళి సీజన్‌లో 10 గ్రాముల సిల్వర్ ధర రూ.1,100 ఉంటే ఈ ఏడాది అదే సమయానికి దాదాపు రెట్టింపయింది. ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత, మైనింగ్‌ తగ్గడం తదితర కారణాలతో ప్రస్తుతం KG వెండి ధర రూ.2 లక్షలు దాటింది. అయితే పండగ తర్వాత ధరలు తగ్గొచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సప్లై పెరగడం, కీలక రంగాల మందగమనం, ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం వంటివి కారణాలుగా చెబుతున్నారు.

News October 16, 2025

AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది: మోదీ

image

ఏపీలో గూగుల్ లాంటి పెద్ద కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టిందని, ఇది సీఎం చంద్రబాబు విజన్ అని ప్రధాని మోదీ అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు ఏపీ తొలి గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ ఏఐ హబ్‌లో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్, ఎనర్జీ స్టోరేజీ, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా ప్రపంచానికి సేవలు అందించనుందని పేర్కొన్నారు.