News July 7, 2024
T20 WC: ఐసీసీ ప్లాట్ఫామ్స్లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్

టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత తమ డిజిటల్ ఛానల్స్లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని వేదికల్లో కలిపి 1.3 బిలియన్ వ్యూస్ సాధించినట్లు తెలిపింది. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఈ ఫైనల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. జూన్ 29న జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా 7 రన్స్ తేడాతో గెలిచి WCని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 31, 2026
రోహిత్ శర్మ ₹214 కోట్ల సామ్రాజ్యం

రోహిత్ శర్మ కేవలం గ్రౌండ్లోనే కాదు బయట కూడా ‘హిట్ మ్యాన్’లాగే బతుకుతున్నారు. ₹214 కోట్ల నెట్వర్త్ ఉన్న ఈ క్రికెటర్ ముంబైలో లగ్జరీ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అహుజా టవర్స్లో ఉన్న ఈ ఇంటి నుంచి సీ-వ్యూ అద్భుతంగా ఉంటుంది. మోడ్రన్ ఇంటీరియర్స్, పీస్ఫుల్ గార్డెన్, క్లాసీ పూజా ఏరియాతో ఈ ఇల్లు కలల సౌధాన్ని తలపిస్తుంది. క్రికెట్తో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఆయన రేంజ్ను మరో లెవల్కు తీసుకెళ్లాయి.
News March 31, 2026
BIG ALERT: వడగళ్ల వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల <<19520557>>వర్షాలు<<>> కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటలలోపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది.
News March 31, 2026
బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం

భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆయన బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అయితే పేస్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో ఆయన TMCలో చేరి తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు.


