News April 29, 2024
T20WC: ఈ నలుగురికి మొండిచేయి?

త్వరలో జరిగే T20WCకు జట్టును ఎంపిక చేసేందుకు BCCI కసరత్తులు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రస్తుత IPLలో ఆటగాళ్ల ప్రదర్శనలపై దృష్టి పెట్టింది. హార్దిక్, గిల్, సూర్యకుమార్, రింకూ సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు WC జట్టును ప్రకటించే గడువు సమీపిస్తోంది. మే 1న 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా.. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ స్థానాలు ఖరారైనట్లు సమాచారం.
Similar News
News October 14, 2025
సరైన నిద్ర లేకపోతే కంటి సమస్యలు!

కంటినిండా నిద్రలేకపోతే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలో కళ్లు సహజంగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల అవి మృదువుగా ఉంటాయని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే కళ్లు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే రెటీనా పనితీరు మందగించి చూపు తగ్గుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
Share it
News October 14, 2025
ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>
News October 14, 2025
₹212 కోట్లతో అమరావతిలో రాజ్భవన్

AP: అమరావతిలో ₹212కోట్లతో రాజ్భవన్ నిర్మించనున్నారు. దీనికి నిధులు, పాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం GO జారీచేసింది. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్గా నిర్మించే ఇందులో గవర్నర్ మాన్షన్, దర్బార్ హాల్, ఆఫీస్, 2 గెస్ట్ హౌస్లు, 6 సీనియర్ స్టాఫ్, 12 జూ.స్టాఫ్, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామిడేషన్లను ఏర్పాటుచేస్తారు. కాంపౌండ్కు 4 వైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి.